ఆ గ్రామ ప్రజలకు ఏపీ సీఎం ఎవరో కూడా తెలియదట..

cm-jagan-siddam-sabha-in-denduluru-today

కాకినాడలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజనాపురం అనే గ్రామ ప్రజలకు ఏపీ సీఎం ఎవరో కూడా తెలియదట. ఈ విషయాన్నీ స్వయంగా వారే తెలిపారు. ఈ గ్రామంలో కొండదొ తెగ ఆదివాసీలు నివశిస్తున్నారు. ఇక్కడి వారికీ సీఎం ఎవరో కూడా తెలియదట. ఈ గ్రామంలో సుమారు 50 మంది నివసిస్తుండగా 19 మందికి ఇటీవల తొలిసారి ఓటు హక్కు వచ్చింది.

వీరంతా తాము ఇంతవరకు ఓటు వేయలేదని చెబుతున్నారు. వీరిలో చాలా మందికి ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవు. కనీసం ఆధార్ కార్డు కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. అందుకే వీరికి సీఎం ఎవరో కూడా తెలియకుండా అయిపోయింది. ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడం తో మరోసారి వీరు వార్తల్లో నిలుస్తున్నారు. మరి ఈసారైనా వీరికి ఓటు హక్కు వస్తుందో చూడాలి.