కొడుకు కు అనారోగ్య సమస్య ఉందని హత్య చేసిన తల్లిదండ్రులు..

కొడుకు కు అనారోగ్య సమస్య ఉందని..ఎంత వైద్యం చేసిన ఫలితం లేదని తెలిసి..చివరకు ఆ ఏడేళ్ల బాలుడ్ని హత్య చేసారు తల్లిదండ్రులు. ఆ తర్వాత వారు కూడా ఉరేసుకొని చనిపోయారు. ఈ ఘటన కన్యాకుమారిలో చోటుచేసుకుంది. కన్యాకుమారి కి చెందిన మురళీధరన్ శైలజ దంపతులకు ఏడేళ్ల జీవా అనే పిల్లాడు ఉన్నాడు. మురళీధరన్ మంచి కంపెనీ లో జాబ్ చేస్తూ ఆర్ధికంగా బాగున్నారు. మూడు నెలల క్రితం ఓ కొత్త ఇల్లు నిర్మించుకొని , ఘనంగా గృహప్రవేశం చేసుకున్నారు. అయితే వారికీ ఒకే ఒక సమస్య అది వల్ల కుమారుడు. చిన్నప్పటి నుండే జీవ అనారోగ్య సమస్య తో బాధపడుతున్నాడు.

ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. ఎప్పటికి ఆ సమస్య అలాగే ఉంటుందని డాక్టర్స్ తేల్చి చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు కొడుకును ఆలా చూడలేక పాలలో నిద్ర మాత్రలు కలిపి తాగించారు. ఆ తర్వాత మొహం ఫై దిండుపెట్టి ఉపిరిడకకుండా చేసి హత్య చేసారు. ఆతర్వాత అదే ఇంట్లో శైలజ, మురళీధరన్ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిశాక పోలీసులు అక్కడకు చేరుకున్నారు.. విచారణ ప్రారంభించిన పోలీసులకు ఈ విషయం తెలిసింది.