జమ్ముకశ్మీర్లో మరోసారి భూకంపం
4.1 తీవ్రతతో కంపించిన భూమి
శ్రీనగర్: ఈరోజు తెల్లవారుజామున 4.29 గంటల సమయంలో జమ్ముకశ్మీర్లో మరోసారి భూకంప సంభవించింది. పహల్గాం సమీపంలో భూమి కంపించింది. దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.1 గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. భూకంప కేంద్రం ఎక్కడ ఉందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపింది. ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా వివారాలు తెలియాల్సి ఉందని వెల్లడించింది. కాగా..గత సోమవారం కూడా జమ్ముకశ్మీర్లో భూకంపం వచ్చింది. హన్లేకి ఈశాణ్యాన 51 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. దీని తీవ్రత 3.5గా నమోదయ్యింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/