తృప్తి లేని మనిషి
ఆధ్యాత్మిక చింతన
ముఖ్యాంశాలు: మనిషి తప్ప ఇతర జీవులన్నీ తృప్తిగానే జీవిస్తుంటాయి.
మనిషికి మనస్సు అనేది ఒకటుంది.ఒక కారుంటే తృప్తిలేదు.
నాలుగు కార్లు కావాలి.తృప్తి ఉంటే ఆనందము దక్కుతుంది.
తృప్తి లేకపోతే అత్యధిక ఆనందం లభిస్తుంది.
ఈ సృష్టిలో రకరకాల జీవులున్నాయి. మనిషి తప్ప ఇతర జీవులన్నీ తృప్తిగానే జీవిస్తుంటాయి.
ఎందుకంటే అవన్నీ జీవించటానికి తమ శరీరాలను నిలుపుకోవటానికి త్యత ఆవశ్యకమైనవి ఏవో అవి లభిస్తే చాలు.
మనిషికి కూడా శారీరక అవసరాల విషయంలో ఒక హద్దు ఉంటుంది. దప్పిక కలుగుతుంది. తగినంత నీరు తాగితే తృప్తి లభిస్తుంది.
ఆకలి అవుతుంది. కడుపునిండా ఆహారం లభిస్తే చాలు తృప్తి కలుగుతుంది. ఇంకాస్త తినండి ని అంటే వద్దు, వద్దు, ఇక చాలు అని అంటాడు.
నిద్ర విషయమూ అంతే. రాత్రంతా గాఢంగా నిద్రపోతే, ఉదయాన్నే సంతోషంగా లేచి పనిచేయటాని ఉపక్రమిస్తాడు. అయితే మనిషికి మనస్సు అనేది ఒకటుంది.
దాన్ని తృప్తి పరచేది కష్టముతో కూడుకున్న పని. కోరికలు పుట్టేది అక్కడే. అవి అనంతములు. ఒక్క కోర్కెను తీరిస్తే వంద కోరికలు పుట్టుకొస్తాయి.
ఓషో ఒక కథ చెబుతాడు. ఒక భిక్షగాడు రాజభవనం ముందు నిలబడి భిక్ష వేయనమి కోరాడు. రాజే స్వయంగా వచ్చి ఏమి ఇవ్వమంటావు? అన్నాడు.
ఏమి ఇచ్చినా పర్వాలేదు గానీ ఈ పాత్ర నిండే వరకు ఇవ్వాలి అని తన భిక్షాపాత్రను రాజుకు చూపాడు ఆ భిక్షగాడు.
అదేమంత కష్టం, ఒరే ఈ పాత్ర నిండా వజ్రాలు, మణులు, మాణిక్యాలు వేయండ్రా అన్నాడు భటులతో. వారు ఆ భిక్షాపాత్రలో ఎన్ని వేసినా నిండలేదు. అద్భుతం!
ఈ పాత్ర ఏమిటితో తయారుచేయబడింది? అని ప్రశ్నించాడు రాజు. ఓ రాజా! ఈ పాత్ర మనిషి పుర్రె అన్నాడు భిక్షగాడు. అసలు విషయం అర్ధమవుతుంది.
అంతులేని కోరికలతో నిండిన మనిషి తల అది. ఎంతిచ్చినా తృప్తి చెందదు, ఏమిచ్చినా తృప్తి చెందదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటాడు మనిషి. ఒక ఇల్లు ఉంటే తృప్తిలేదు.
నాలుగిండ్లు కావాలి అంటాడు మనిషి. ఒక ఇల్లు ఉంటే తృప్తిలేదు. నాలుగిండ్లు కావాలి. ఒక కారుంటే తృప్తిలేదు. నాలుగు కార్లు కావాలి. లక్షరూపాయలుంటే తృప్తి లేదు, కోటి రూపాయలు కావాలి. రెండు తరాలకు సరిపడే ఆస్తి ఉంటే తృప్తిలేదు,
పది తరాలకు సరిపడే ఆస్తిని కూడబెట్టాలి. ఇక శాంతి ఎక్కడుంటుంది? జీవితమంతా ఆరాటము, పోరాటమే, ఆందోళన, అలసటే. అందుకే ఉన్నదానితో తృప్తి పడు అంటారు పెద్దలు. అయితే కొన్ని విషయాల్లో తృప్తి పడరాదట.
సంతోషస్త్రిషు కర్తవ్యః స్వాధ్యాయే జపదానయోః
త్రిషు చైవన న కర్తవ్యః స్వాధ్యాయే జపదాన యోః
దీని భావం ఏమంటే తనకు ప్రాప్తించిన భార్య, భోజనము, ధనము ఈ మూడింటి విషయంలో తృప్తి ఉండాలి.
వేదాధ్యనము, జపము, దానము ఈ మూడింటి విషయంలో చేసినది చాలు అను తృప్తి ఉండరాదు. భార్య, భోజనము, ధనము విషయంలో తృప్తి ఉంటే ఆనందము దక్కుతుంది. తృప్తి లేకపోతే అత్యధిక ఆనందం లభిస్తుంది.
త విషయాన్ని ఏ వ్యక్తి అయినా అనుభవ పూర్వకంగా గ్రహించవచ్చు. వివేకవంతుడు సరైన విషయాలను సరైన విధంగా ఎంపిక చేసుకుని తృప్తి చెందుతాడు, లాభపడతాడు. ఆనందాన్ని అనుభవిస్తాడు.
- రాచమడుగు శ్రీనివాసులు
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/