సత్తెనపల్లి లో ఘటన బాధాకరం : అంబటి

ఎమ్మెల్యే ‘అంబటి’ వీడియో ప్రకటన

సత్తెనపల్లి: సత్తెనపల్లిలో ఇవాళ ఉదయం జరగిన ఘటనలో గౌస్‌ మృతిచెందటం బాదాకరమని ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు..

సోమవారం ఆయన వీడియో సందేశాన్ని పోస్ట్‌చేశారు.. ఎంతోప్రశాంతంగా ఉండే సత్తెనపల్లిలో పోలీసు దెబ్బలకు ఒకరు చనిపోవటం ఎంతో బాధకల్గించిందన్నారు..

మ్యాన్‌ హ్యండ్లింగ్‌ చేసిన ఎస్‌ఐపై తక్షణమే చర్యల తీసుకోవాలని ఎస్పీతో మాట్లాడటం జరిగిందన్నారు..

చనిపోయిన గౌస్‌ తండ్రి ఆదాంకు కటుంబ సభ/్యలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు..

ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమని , త్వరలోనే వారి కుటుంబాన్ని పరామర్శిస్తానని ఎమ్మెల్యే అంబటి తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/