ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఆగివున్న లారీని ఢికొట్టిన కారు

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి

Accident
Accident

శంషాబాద్‌: భాగ్యనగరంలోని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న కారు ఢీ కొన్నది. కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు బాల్‌రెడ్డి నర్సింహా, శంకర్‌లుగా గుర్తించడం జరిగింది. వీరి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఫారుఖ్ నగర్ మండల్ సోల్ పేట్‌ అని తెలిసింది. మరోవైపు.. క్షతగాత్రుడైన మరొకర్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. కాగా.. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వస్తుండగా రాళ్లగుడా ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/