సిరిసిల్ల, వేములవాడలో పర్యటన
Hyderabad: మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల, వేములవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు సిరిసిల్ల పద్మనాయక కల్యాణమండపంలో పంచాయతీరాజ్ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు వేములవాడ పట్టణ ప్రగతి సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొననున్నారు. అనంతరం మహారాజా ఫంక్షన్ హాల్లో మున్సిపల్ అధికారులతో కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు రాజన్న ఆలయ గుడిచెరువులో శివార్చనను కేటీఆర్ ప్రారంభించనున్నారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/