2,100 దాటిన కొవిడ్‌-19 మృతులు

చైనాలో తగ్గుతున్న కరోనా వైరస్‌ కేసులు

coronavirus
coronavirus

చైనా: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కారణంగా చైనాలోని హుడే ప్రావిన్సుల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,112కి చేరింది. కోవిడ్ వల్ల బుధవారం మరో 108 మంది మృతిచెందారు. ఇక, కొత్తగా వైరస్ సోకినవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. గడచిన వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బాధితుల సంఖ్య బుధవారం మరింత తగ్గింది. కేవలం 349 కేసులు మాత్రమే నమోదయినట్టు చైనా జాతీయ హెల్త్ కమిషన్ ప్రకటించింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 74,534కి చేరినట్టు తెలిపింది. కరోనా వైరస్ తొలిసారి బయటపడ్డ వుహాన్ నగరంలోనే వ్యాధి తీవ్రత అధికంగా ఉంది. ఈ నగరంలోనే ఏకంగా 2,100 మంది మృత్యువాతపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/