ఈరోజు నాల్గు సభల్లో కేసీఆర్ ప్రసంగం

cm-kcr-praja-ashirvada-public-meeting-in-manakondur

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ ..సీఎం కేసీఆర్ ఈరోజు నాల్గు సభల్లో పాల్గొనబోతున్నారు. గత కొద్దీ రోజులుగా ప్రజా ఆశీర్వాద సభ పేరుతో అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ మరోసారి బిఆర్ఎస్ కు ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరుతూ వస్తున్నారు. ఈ క్రమంలో నేడు తాండూర్, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి నియోజక వర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా కేసీఆర్.. అక్టోబర్ 15 నుంచే ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభ నుంచి ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించారు.. ఇప్పటి వరకు 74 సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 28 వరకు కేసీఆర్.. మరో 23 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఇక ఈ నెల 25న సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొంటారు.