నేడు వరంగల్‌లో పవన్ కళ్యాణ్ ప్రచారం..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు వరంగల్ , కొత్తగూడెం లలో పర్యటించనున్నారు. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో కలిసి జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా..మిగతా స్థానాల్లో బిజెపి కి మద్దతు తెలుపుతుంది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ ..బిజెపి , జనసేన అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు.

రేపు , ఎల్లుండి పవన్ కళ్యాణ్ వరంగల్ , కొత్తగూడెం , సూర్యాపేట , దుబ్బాక లలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను జనసేన పార్టీ అధికారికంగా విడుదల చేసింది. రేపు (నవంబర్ 22) ఉదయం 11 గంటలకు కొత్తగూడెం లో జరిగే సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ సభలో పాల్గొంటారు. ఎల్లుండి (నవంబర్ 23) మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేట లో జరగబోయే సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 : 30 కు దుబ్బాక లో జరగబోయే సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. జనసేన మొత్తం 32 స్థానాల్లో పోటీ చెయ్యాలి అనుకున్నా.. 8 స్థానాలను బీజేపీ ఫైనలైజ్ చెయ్యడంతో.. ఆ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టారు. ఐతే.. తమ అభ్యర్థుల కోసం మాత్రమే కాకుండా.. బీజేపీ అభ్యర్థుల తరపున కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. ఓవైపు సినిమా షూటింగ్స్ చూసుకుంటూ.. మరోవైపు రాజకీయాలూ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు పవన్. ఈ క్రమంలో పవన్ చాల నెలల తర్వాత తెలంగాణ లో పర్యటించబోతుండడం తో ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు , కార్యకర్తలు తరలిరావడం ఖాయం.