దర్శకుడు మారుతీ ఇంట విషాదం..

చిత్రసీమలో వరుస విషాదాలు అభిమానులను , సినీ ప్రముఖులను కలవరపెడుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ప్రముఖ నిర్మాత నారంగ్​, సీనియర్​ దర్శకుడు తాతినేని స్వర్గస్తులు కాగా ఈరోజు మరో విషాద వార్త బయటకు వచ్చింది. దర్శకుడు మారుతీ ఇంట విషాదం నెలకొంది. మారుతీ తండ్రి కుచలరావు కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న ఈయన బుధువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. గత అర్ధరాత్రి మచిలీపట్టణంలోని తన స్వగృహంలో ఆయన కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన పలువురు టాలీవుడ్ ప్రముఖులు మారుతికి ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు.

ఇక మారుతీ సినిమాల విషయానికి వస్తే..ఈరోజుల్లో మూవీ తో డైరెక్టర్ గా పరిచయమైనా ఈయన..మొదట్లో యూత్ చిత్రాలను తెరకెక్కించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ కథలతో ప్రేక్షకులను మెప్పించారు. బాబు బంగారం , ప్రతి రోజు పండగే, మహానుభావుడు , భలే భలే మగాడివో వంటి వరుస సినిమాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం గోపీచంద్ తో పక్కా కమర్షియల్ మూవీ చేస్తున్నాడు. జులై 01 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీని తర్వాత ప్రభాస్​తో ఓ సినిమా చేయబోతున్నారు. మరి కొద్ది రోజుల్లో అది సెట్స్​పైకి వెళ్లనుంది.