నిజామాబాద్‌ ఎంపీగా మరోసారి కవిత పోటీ !

Telangana Leader K Kavitha To Contest From Nizamabad Again In 2024

హైదరాబాద్‌ః ఎమ్మెల్సీ కవిత మరోసారి నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేసి గెలుస్తానని వెల్లడించారు. బిజెపి ఎంపీ అరవింద్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కోరుట్ల పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రధాన పోటీ కాంగ్రెస్ ఏనని కవిత స్పష్టం చేశారు.

తెలంగాణలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ లేదని పార్లమెంటులో బండి సంజయ్ ప్రస్తావించండంపై కవిత తీవ్రంగా ఫైర్ అయ్యారు. బిజెపి కార్యాలయం వద్ద కరెంటు తీగలు పట్టుకొని చూడమని బండికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో బిఆర్ఎస్​కు ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీయేనని కవిత అన్నారు. రెండు పార్టీల మధ్య సుమారు 20 శాతం ఓట్ల తేడా ఉంటుందని కవిత తెలిపారు.