హైదరాబాద్ : తెలంగాణలో కెసిఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం కొసం ..దసరా కానుకగా, అక్టోబర్ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ మెనూ ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జడ్పీహెచ్ఎస్లో ఈ పథకాన్ని శుక్రవారం ఉదయం 8:45 గంటలకు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే అల్పాహారం
అందివ్వనున్నారు.
అల్పాహారం మెనూ ఇదే..
సోమవారం – ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ మంగళవారం – పూరి, ఆలు కుర్మ లేదా టమాటా బాత్ విత్ రవ్వ, చట్నీ బుధవారం – ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చట్నీ గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్ శుక్రవారం – ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ శనివారం – పొంగల్/సాంబార్ లేదా వెజిటబుల్ పొలావ్, రైతా/ఆలు కుర్మ
ప్రైమరీ స్కూల్ టైమింగ్స్..
ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు ప్రైమరీ స్కూల్స్ పని చేస్తాయి. బ్రేక్ ఫాస్ట్ టైమింగ్స్ – ఉదయం 8:45 గంటల నుంచి ప్రార్థనా సమయం – 9:35 నుంచి 9:45 వరకు