తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో అల్ఫహరం మెను ఖరారు

రేపు ప్రారంభించ‌నున్న సిఎం కెసిఆర్‌

telangana-government-school-breakfast-menu-finalized

హైద‌రాబాద్ : తెలంగాణలో కెసిఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్ట‌నుంది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం కొసం ..దసరా కానుకగా, అక్టోబర్ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభం కానుంది. ఈ మేర‌కు సీఎం బ్రేక్ ఫాస్ట్ మెనూ ఖ‌రారైంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రావిర్యాల జ‌డ్పీహెచ్ఎస్‌లో ఈ ప‌థ‌కాన్ని శుక్ర‌వారం ఉద‌యం 8:45 గంట‌ల‌కు ప్రారంభించ‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 పాఠ‌శాల‌ల్లో 23 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌యోజ‌నం పొంద‌నున్నారు. పాఠ‌శాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే అల్పాహారం

అందివ్వ‌నున్నారు.

అల్పాహారం మెనూ ఇదే..

సోమ‌వారం – ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ ర‌వ్వ ఉప్మా, చ‌ట్నీ
మంగ‌ళ‌వారం – పూరి, ఆలు కుర్మ లేదా ట‌మాటా బాత్ విత్ ర‌వ్వ‌, చ‌ట్నీ
బుధ‌వారం – ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చ‌ట్నీ
గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగ‌ల్, సాంబార్
శుక్ర‌వారం – ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చ‌ట్నీ లేదా గోధుమ ర‌వ్వ కిచిడీ, చ‌ట్నీ
శ‌నివారం – పొంగ‌ల్/సాంబార్ లేదా వెజిట‌బుల్ పొలావ్, రైతా/ఆలు కుర్మ‌

ప్రైమ‌రీ స్కూల్ టైమింగ్స్..

ఉద‌యం 9:30 నుంచి సాయంత్రం 4:15 గంట‌ల వ‌ర‌కు ప్రైమ‌రీ స్కూల్స్ ప‌ని చేస్తాయి.
బ్రేక్ ఫాస్ట్ టైమింగ్స్ – ఉద‌యం 8:45 గంట‌ల నుంచి
ప్రార్థ‌నా స‌మ‌యం – 9:35 నుంచి 9:45 వ‌ర‌కు

హైద‌రాబాద్, సికింద్రాబాద్ ప‌రిధిలోని స్కూల్స్ టైమింగ్స్..

ఉద‌యం 8:45 నుంచి సాయంత్రం 3:45 వ‌ర‌కు ప‌ని చేస్తాయి.
బ్రేక్ ఫాస్ట్ టైమింగ్స్ – ఉద‌యం 8 గంట‌ల నుంచి
ప్రార్థ‌నా స‌మ‌యం – 8:50 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు

అప్ప‌ర్ ప్రైమ‌రీ, హై స్కూల్ స్కూల్ టైమింగ్స్..

ఉద‌యం 9:30 నుంచి సాయంత్రం 4:45 గంట‌ల వ‌ర‌కు ప్రైమ‌రీ స్కూల్స్ ప‌ని చేస్తాయి.
బ్రేక్ ఫాస్ట్ టైమింగ్స్ – ఉద‌యం 8:45 గంట‌ల నుం