ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు ..ఆరుగురు నక్సలైట్లకు గాయాలు

encounter-in-sukma-between-security-forces-naxalites-

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటుచేసుకునాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు ఆరుగురు నక్సలైట్లు గాయపడినట్లు సమాచారం. కోబ్రా , ఎస్‌టీఎఫ్ , సీఆర్‌పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా సక్లార్‌ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో పోలీసుల కాల్పుల్లో ఐదు నుంచి ఆరుగురు మావోయిస్టులు గాయపడ్డారు. సంఘటన స్థలంలో పెద్దసంఖ్యలో బీజీఎల్, ఇతర పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతున్నదని సుక్మా ఎస్పీ సునీల్‌ శర్మ వెల్లడించారు.