తెలంగాణ లో కొనసాగుతున్న పోలింగ్ లెక్కింపు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ కు సంబదించిన ఫలితాల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటి వరకు మూడు రౌండ్స్ పూర్తి కాగా కాంగ్రెస్ పార్టీ ముందంజ లో ఉంది. హైదరాబాద్ లో బిఆర్ఎస్ హావ కొనసాగుతుంది. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి సగానికి పైగా నియోజకవర్గాల్లో లీడ్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, రాజస్థాన్ లో బీజేపీ 107 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంటే.. కాంగ్రెస్ 76 స్థానాల్లో ముందంజలో ఉంది. అటు మధ్య ప్రదేశ్ లోనూ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసింది. 150 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 74 స్థానాలు, ఇతరులు ఒక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 53, కాంగ్రెస్‌ 34, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.