నేడు కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

CM KCR

సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల విస్తరణ, పెండింగ్ పనులు పూర్తి చేయడం వంటి వాటిపై చర్చించనున్నారు. గత ఎన్నికల సమయంలో నిరుద్యోగభృతి వంటి హామీలను కేసీఆర్ ఇచ్చారు. ఈనాటి సమావేశంలో వీటిపై చర్చించనున్నారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో కారిడార్ నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మరో ఐదు కొత్త మెట్రో ప్రాజెక్టులను నిర్మించే అంశాన్ని సైతం పరిశీలిస్తోంది. BHEL నుంచి లక్డికపూల్ వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు కొత్త లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం ఇవ్వబోయే కొత్త హామీలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. గృహలక్ష్మి, రెండో విడత దళితబంధు, బీసీలు, మైనార్టీలకు రూ. లక్ష ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు, ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు, పంట రుణాల మాఫీ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు 40 నుంచి 50 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది.