జైపూర్-ముంబై ఎక్స్ప్రెస్లో కాల్పులు..
జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న జైపూర్ ఎక్స్ప్రెస్లో కాల్పులు కలకలం రేపాయి. మహరాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటి వెళ్తున్న సమయంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ బీ5 కోచ్లో ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.
ఆర్పీఎఫ్ ఏఎస్సైతో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల అనంతరం చేతన్ ట్రైన్ నుండి కిందకు దూకేసాడు. చేతన్కుమార్ ఉన్నట్టుండి ఆర్పీఎఫ్ ఏఎస్సై టికారామ్ మీనాపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత మరో బోగీలోకి వెళ్లి ప్రయాణికులపై కాల్పులు జరిపాడు.