బైక్ యాక్సిడెంట్ర్ జరిగిన సమయంలో అంత దారుణంగా మాట్లాడారంటూ తేజ్ ఎమోషల్

Sai dharam Tej
Sai dharam Tej

బైక్ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. కొద్దీ రోజుల పాటు ఆయనకు స్పృహ రాకపోయేసరికి మెగా ఫ్యామిలీ ఎంతో ఆందోళనకు గురైయ్యారు. ఆ తర్వాత స్పృహ లోకి రావడం తో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం చాల గ్యాప్ తర్వాత విరూపాక్ష మూవీ తో ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న తేజ్..బైక్ ఆక్సిడెంట్ కు సంబదించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసారు.

ఈ ప్రమాదం జరిగిన తరువాత నాకు మాట విలువ ఏంటో తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు నేను షాక్ కి గురయ్యాను. దీంతో మాట కూడా పడిపోయింది. అయితే జనాలకి నాకు మాటపడిపోయిన విషయం తెలియదు. దీంతో వీడేంటి తాగేసి మాట్లాడుతున్నాడా? అంటూ జోకులేసుకున్నారు. కానీ మాట రావడం కోసం నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. మాటలు రాలేదని ఎంతో బాధ పడ్డాను. నేను చిన్నతనం నుంచి ఎక్కువగా మాట్లాడే వాడిని. అలాంటి నాకు ఒక్కసారిగా మాటలు రాకపోవడంతో చాలా మానసిక వేదనకు గురయ్యాను.

మాట్లాడటం అనేది ఎంత సంతోషాన్ని ఇస్తాదో, ఎంతో ముఖ్యమో ఈ ప్రమాదం ద్వారా తెలుసుకున్నాను. నా చుట్టు పక్కల ఉండే వారు నా కోసం ఎంతో ఓర్పుగా ఉన్నారు. నేను మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఓపికగా నా మాటలు వినేవారు. అర్థంకాకుంటే.. అర్థం కాలేదు మరోసారి చెప్పు అని మరీ నా చేత మాట్లాడించే వాళ్లు. అలానే నా సినిమాల డైరెక్టర్లు, నాతోటి నటీనటులు నాకు చాలా మద్దతుగా నిలబడ్డారు అని చెప్పుకొచ్చాడు.