డ్రగ్స్ కేసు : ముమైత్ ను విచారిస్తున్న ఈడీ అధికారులు
డ్రగ్స్ కొనుగోళ్లు… మనీ లాండరింగ్ కేసుల నేపథ్యంలో బుధువారం ప్రముఖ నటి ముమైత్ ఖాన్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ముమైత్ ఈడీ ఆఫీస్ కు చేరుకుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపై అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు. కెల్విన్, వాహిద్లను ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ కేసు విషయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నటులు రాణా, నందు, రవితేజ, నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్తో పాటు మత్తు మందు సరఫరాదారులు కెల్విన్, వాహిద్లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి వారి ఖాతాల్లో అనుమానాస్పదంగా ఉన్న లావాదేవీలపై అడిగి తెలుసుకున్నారు. ఇక నవదీప్ ను మాత్రం ఏకంగా 9 గంటల పాటు విచారించారు. మరి ఈరోజు ముమైత్ నుండి ఎలాంటి సమాదానాలు రాబడతారో చూడాలి.