అమిత్ షా విమానంలో సాంకేతిక లోపం ..

కేంద్ర మంత్రి అమిత్ షా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆదివారం అమిత్ హైదరాబాదులో సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. హకీంపేటలో సీఐఎస్ఎఫ్ దళాల గౌరవ వందనం స్వీకరించి , ఉత్తమ సేవలు అందించిన సీఐఎస్ఎఫ్ అధికారులకు అమిత్ షా రివార్డులు అందజేశారు.

అనంతరం అమిత్ షా హైదరాబాద్ నుండి కొచ్చి వెళ్లాల్సి ఉండగా, ఆయన ప్రయాణించాల్సిన విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దాంతో ఆయన హకీంపేట విమానాశ్రయంలోనే ఉండిపోయారు. విమాన మరమ్మతులకు సమయం పట్టడంతో అమిత్ షా… విమానాశ్రయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ లతో సమావేశమయ్యారు.రాష్ట్రంలో పార్టీని బలోపేతీం చేసే విషయమై అమిత్ షాతో పార్టీ నేతలు చర్చించారు. బీఆర్ఎస్ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు అవలంభించాల్సిన తీరుపై నేతలకు అమిత్ షా దిశా నిర్ధేశం చేశారని సమాచారం.