ఏపీలో స్టిక్కర్ల హడావిడి : జగన్ స్టిక్కర్లకు పోటీగా టీడీపీ కౌంటర్ స్టిక్కర్లు..

ఏపీలో ప్రస్తుతం స్టిక్కర్ల హడావిడి మొదలైంది. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ వైస్సార్సీపీ ప్రభుత్వం ఇంటింటికి స్టిక్కర్ల అంటించే పని పెట్టుకుంటే..ప్రతిపక్షపార్టీలు జగన్ స్టిక్కర్లకు కౌంటర్ గా తమ పార్టీల స్టిక్కర్లను అంటిస్తునారు. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ వైస్సార్సీపీ ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అంటిస్తుంటే.. అందుకు ప్రతిగా జనసేన పార్టీ ‘మాకు నమ్మకంలేదు జగన్‌, మా నమ్మకం పవన్‌’ అనే స్టిక్కర్లను వైస్సార్సీపీ స్టిక్కర్ల పక్కనే అంటిస్తూ నిరసన చేస్తున్నారు.

ఇక ఇప్పుడు టీడీపీ సైతం స్టిక్కర్లను నటించే పని పెట్టుకున్నారు. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో వైస్సార్సీపీ నేతలు మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో అంటించిన స్టిక్కర్లకు పైన టీడీపీ నేతలు కౌంటర్ స్టిక్కర్లను ఈరోజు నుంచి అంటించడం మొదలుపెట్టారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి- మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలంటూ ఈ స్టిక్కర్లపై నినాదాలు దర్శనమిస్తున్నాయి. వీటిపై స్ధానిక టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, చంద్రబాబు ఫొటోల్ని పెట్టి అంటిస్తున్నారు. దీంతో ఈ స్టిక్కర్ వార్ కలకలం రేపుతోంది.