వైస్సార్సీపీ నేతల ఆరోపణలపై గోరంట్ల ఆసక్తికర వ్యాఖ్య

అమావతి : టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ వైస్సార్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి ఇప్పుడు అమరావతి అని చంద్రబాబు మరో పోటు పొడుస్తారని మంత్రులు చేసిన వ్యాఖ్యల్ని బుచ్చయ్య ప్రస్తావించారు. మరి దివంగత నేతని అంబానీ చంపించారు, అని ఆస్తులు ధ్వంసం చేసి చివరికి అతని మనిషికే రాజ్యసభ సీటు ఇప్పించిన మీరు ఎవరికి (వై.ఎస్) వెన్నుపోటు పొడిచినట్లు వైఎస్ జగన్ ? అంటూ ట్వీట్ చేశారు. ‘ముందర గుండెపోటు అని తరువాత గొడ్డలి పోటు అన్నారు. మరి బాబాయ్ కి ఎన్ని పోట్లు పొడిచారు?’ అని ప్రశ్నించారు.

ఏపీలో మద్యం ధరలను ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మరో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో బాటిల్ రేటు తగ్గింది అంటే అమ్మకాలు పెరుగుతాయా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు? అని గోరంట్ల ప్రశ్నించారు. అంటే మొన్నామధ్య రేటు పెరిగితే తాగడం మానేస్తారు అన్నారు ఒకరు ‘ది గ్రేట్ బ్లఫ్ మాస్టర్ ఆ ఆంధ్ర’ అంటూ సెటైర్లు వేశారు. ఒరిస్సాలో స్టార్ట్ అప్స్ కోసం O – hub పెట్టారు..తెలంగాణలో T – Hub పెట్టారు.. ఏపీలో మాత్రం ‘ఫిష్’ ఆంధ్ర, ‘మటన్’ ఆంధ్ర పాయింట్లు పెడుతున్నారని గోరంట్ల ఎద్దేవా చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/