సీఎం సీట్లో మంత్రి అమర్నాథ్..

సచివాలయం ఒకటో బ్లాక్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అమర్నాథ్ సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఈ ఘటనపై టీడీపీ విమర్శలు చేసింది. ఓ రివ్యూ సందర్భంగా మంత్రి అధికారులతో ఉన్న ఫొటోను షేర్ చేసిన టీడీపీ.. ‘టికెట్ రాని గుడ్డు మంత్రిని, నీ సీట్లో కూర్చోపెట్టి సంతోషపెడుతున్నావా జగన్? లేక ఆ గుడ్డు మంత్రి, నీ సీటుకే ఎసరు పెడుతున్నారా?’ అని ప్రశ్నించింది.

రాష్ట్రంలో రూ.4,883 కోట్ల పెట్టుబడులతో రిలయన్స్‌ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌ సహా పలు సంస్థల పరిశ్రమలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. సచివాలయం ఒకటో నంబర్ బ్లాక్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బ్లాక్ లో ముఖ్యమంత్రి తప్ప ఇతర మంత్రుల ప్రోగ్రామ్స్ నిర్వహించరు. కానీ సచివాలయంలో ఒకటో బ్లాక్ లో సీఎం కుర్చీలో కూర్చుని మంత్రి అమర్నాథ్ రివ్యూ నిర్వహించారు.