జిల్లాల పర్యటన..విశాఖ చేరకున్న చంద్రబాబు

ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు


విశాఖపట్నం: ‘ఎన్టీఆర్ స్ఫూర్తి – చంద్రన్న భరోసా’ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా మలి విడత పర్యటనలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మహానాడు స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, జిల్లా మహానాడు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకున్న చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు.

కాసేపట్లో గాజువాకలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో పాల్గొననున్న చంద్రబాబు.. రోడ్​షో అనంతరం చోడవరంలో కార్యకర్తలతో భేటీకానున్నారు. విశాఖ జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్న టీడీపీ అధినేత.. అనకాపల్లిలో ఏర్పాటు చేసిన మినీ మహానాడులో పాల్గొననున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/