బాలకృష్ణ గురించి తారకరత్న భార్య అలేఖ్య ఎమోషనల్ పోస్ట్

నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18 న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృతువు తో పోరాడిన తారకరత్న ..చివరికి మృతువు నుండి బయటపడలేకపోయారు. తారకరత్న మృతి తో నందమూరి ఫ్యామిలీ తో పాటు టిడిపి శ్రేణుల్లో, సినీ లోకంలో విషాదం నెలకొంది. ఈ విషాదం నుంచి ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఇంకా కోలుకోలేకపోతున్నారు. తాజాగా బాలకృష్ణ గురించి ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు.

‘మనం సొంత కుటుంబంగా పిలిచే ఏకైక వ్యక్తి (బాలకృష్ణ). కష్ట, సుఖాల్లో చివరి వరకు ఒక కొండలా అండగా నిలిచిన ఏకైక వ్యక్తి. ఒక తండ్రిలా ఆసుపత్రికి తీసుకెళ్లడం దగ్గర నుంచి ఆసుపత్రిలో నీ బెడ్ పక్కన కూర్చోవడం, నీ కోసం తల్లిలా పాటలు పాడటం, సిల్లీ జోక్స్ వేసి నువ్వు రియాక్ట్ కావాలని ప్రయత్నించడం, చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవడం… ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారు. ఓబు (తారకరత్న) నీవు తొందరగా వెల్లిపోయావు. మిస్ యూ సోమచ్’ అని అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.