తారకరత్న పెద్ద కర్మ జ్ఞాపకార్థంగా వచ్చినవారికి ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే..

నందమూరి తారకరత్న దిన కర్మ ఈరోజు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు , సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాగా కార్యక్రమానికి వచ్చిన అతిథులకు తారకరత్న కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకార్థంగా వంట పాత్రలను బహుమతులుగా అందించారు.

ప్రెస్టీజ్ కంపెనీకి చెందిన 4.6 లీటర్ల కాసరోల్‌ను ఒక్కొక్కరికి అందివ్వడం జరిగింది. దీని ఖరీదు సుమారు రూ.1400. ఈ కాసరోల్‌లో రెండు మూడు రకాల స్వీట్ల ప్యాకెట్ కూడా ఉంచారు. ‘మన హృదయాల్లో చిరకాలం నిలిచిపోయే మనకెంతో ఇష్టమైన నందమూరి తారకరత్న జ్ఞాపకార్థం’ అని నందమూరి ఫ్యామిలీ తెలియజేస్తున్నట్టు ఒక కార్డు కూడా ఉంచారు. మొత్తం మీద ఈ బహుమతులు అతిథులను ఎంతగానో ఆకర్షించాయి.

నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18 న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృతువు తో పోరాడిన తారకరత్న ..చివరికి మృతువు నుండి బయటపడలేకపోయారు. తారకరత్న మృతి తో నందమూరి ఫ్యామిలీ తో పాటు టిడిపి శ్రేణుల్లో విషాదం నెలకొంది.