చంద్ర‌బాబును క‌లిసిన స్టాలిన్‌

ఏపీలో కూటమి సంచలన విజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 , 25 పార్లమెంట్ స్థానాలకు గాను 21 దక్కించుకొని ఆశ్చర్యపరిచారు. జనసేన , టిడిపి , బిజెపి మూడు పార్టీల సమిష్టి కృషి వల్లే ఈరోజు ఎంత పెద్ద విజయం సాధించామని మూడు పార్టీల నేతలు చెపుతున్నారు. ఈ అఖండ విజయం సాదించడం పట్ల రాజకీయ నేతలంతా స్పందిస్తూ చంద్రబాబు కు విషెష్ అందిస్తున్నారు.

ఈ తరుణంలో త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ బుధ‌వారం టీడీపీ అధినేత చంద్ర‌బాబు ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించింనందుకు బాబుకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. “ఢిల్లీ విమానాశ్ర‌యంలో త‌లైవ‌ర్ క‌లైంగ‌ర్ కరుణానిధికి చిర‌కాల మిత్రుడు చంద్ర‌బాబును క‌లిశాను. త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య సంబంధాల‌ను బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాం. కేంద్రంలో ఆయ‌న కీల‌క‌పాత్ర పోషిస్తార‌ని నాకు న‌మ్మ‌కం ఉంది. ద‌క్షిణాది రాష్ట్రాల కోసం పోరాడుతూ మ‌న హ‌క్కుల‌ను కాపాడ‌తార‌ని విశ్వ‌సిస్తున్నా” అని ఆయన ట్వీట్ చేశారు.

Met Thiru @ncbn garu, a longtime friend of Thalaivar Kalaignar, at Delhi Airport. I conveyed my best wishes to him and expressed hope that we will collaborate to strengthen the ties between the brotherly states of Tamil Nadu and Andhra Pradesh. I am confident that he will play a… pic.twitter.com/IElYek4hQi— M.K.Stalin (@mkstalin) June 5, 2024