బోల్డ్ సీన్ల ఫై మనసు మార్చుకున్న తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా ఇంతకాలం సంపాదించుకున్న పేరు..రెండు వెబ్ సిరీస్ లు చెడగొట్టాయి. మొన్నటి వరకు తమన్నా ను ఎంతో ఇష్టపడ్డ అభిమానులు..ఇప్పుడు ఛీ కొడుతున్నారు. దీనికి కారణం ఆమె బోల్డ్ సీన్లలో నటించడమే. ఇండస్ట్రీ లో అడుగుపెట్టి చాల ఏళ్లు అవుతున్నప్పటికీ..ఇంకా ఛాన్సులు రాబట్టుకుంటూ అభిమానులను అలరిస్తుంది. ప్రస్తుతం ప్రేక్షకులు వెబ్ సిరీస్ ల ఫై ఇంట్రస్ట్ చూపిస్తుండడం తో అమ్మడు ఆ వైపు చూసింది.

ఈమె చేసిన జీ కర్దా మరియు లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లు ఓటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సిరీస్ లతో బిజీ కావడం ఖాయం అని మిల్కీ బ్యూటీ తమన్నా అనుకుంది. కానీ ఆమె అనుకుంది ఒకటి జరిగింది ఒకటి. ఆ సిరీస్ లో నటించినందుకు ఆమెపై విమర్శలు చేసారు. జీ కర్దా లో బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించి షాక్ ఇవ్వగా.. లస్ట్ స్టోరీస్ 2 లో బోల్డ్ సన్నివేశాల్లో నటించి అభిమానుల నుండి విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. ఈమె సీన్లు చూసి అభిమానులు సైతం తిట్టుకున్నారు. సోషల్ మీడియా లో అయితే ఓ రేంజ్ లో విమర్శలు, సెటైర్లు వేశారు.

దీంతో తమన్నా మనసు మార్చుకుంది. తాజాగా తనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ కు మిల్కీ బ్యూటీ తమన్నా స్పందించింది. ప్రస్తుత జనరేషన్ ప్రేక్షకులు కూడా నన్ను విమర్శిస్తారని… ఆ సీన్స్ మరియు డైలాగ్స్ కు ట్రోల్స్ చేస్తారు అనుకోలేదు అంది. తప్పకుండా ఈ జనరేషన్ వారికి నచ్చుతుందని అనుకున్నాను. కానీ నన్ను వారు ఇలా చూడాలి అనుకోవడం లేదని నాకు అర్థం అయ్యింది.. కనుక ముందు ముందు తన నిర్ణయాల విషయంలో మరింతగా ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చింది.