తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తన ఆరోగ్యం ఫై వస్తున్న వార్తలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తాను అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ టీవీ ఛానల్ లో వార్తలు ప్రసారం అవ్వడం ఫై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు. తాను అస్వస్థతకు గురయ్యానంటూ ఓ మీడియా ఛానల్ లో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కొట్టి పారేశారు.

ప్రస్తుతం హైదరాబాద్ లోని నివాసంలోనే ఉన్నానని.. తనకు ఎటువంటి బ్రీతింగ్ ప్రాబ్లం లేదన్నారు. తన ఆరోగ్యం ఫై అసత్య ప్రచారం చేస్తే ఊరుకోనని , చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందవద్దని సూచించారు. కాసేపటి క్రితమే నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన చెల్లబోయిన ఉపేందర్ కుటుంబాన్ని కలిశానని తెలిపారు.