మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరావు కన్నుమూత

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లరేవు మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరావు (66) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు న్న ఆయన ఫౌండేషన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దొమ్మేటి మరణం పట్ల ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

2004 నుంచి 2009 వరకు ఆయన తాళ్లరేవు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆప్తుడిగానూ ఉన్నారు. గతంలో డీసీసీ అధ్యక్షుడిగానూ దొమ్మేటి పని చేశారు. గతంలో ఆయన జనసేన పార్టీలో పని చేశారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర సమయంలో.. వెంకటేశ్వరరావు కలిసి తన మద్దతును ప్రకటించి వైస్సార్సీపీ లో చేరారు.