నెల్లూరు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా

పలువురికి గాయాలు

Road Accident
Road accident in Nellore district

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది.. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు బళ్లారి నుంచి నెల్లూరు వస్తుండగా కండ్రిక దగ్గర ఈ ప్రమాదం జరగటంతో స్థానికులు బస్సు అద్దాలు పగులగొట్టి పలువురి ప్రాణాలు కాపాడారు. పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/