దివంగత నటుడు సుశాంత్ సింగ్ ఇంట్లో విషాదం

దివంగత నటుడు సుశాంత్ సింగ్ ఇంట్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంలోని 5 గురు కుటుంబ సభ్యులు దారుణమైన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసారు. నవంబర్ 16 ఉదయం బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో జాతీయ రహదారి నవంబర్ 333లో ట్రక్కును ఢీ కొనడంతో సుశాంత్ కుటుంబ సభ్యులు మరణించారు. 10 మందితో ప్రయాణిస్తున్న వాహనంలో ఆరుగురు అక్కడకిక్కడే మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపారు.

సుశాంత్ మరణించిన విషయాన్నే చాలా రోజుల వరకు అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అంతలోనే ఆయన పెద్దక్క గీతా సింగ్ మరణించారు. ఆమె మరణం కూడా అందర్నీ కలిచివేసింది. ఇప్పుడు ఏకంగా ఆ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.