అమరావతిపై ఏపి ప్రభుత్వం పిటిషన్లు..మార్చి 28న విచారణ

'Supreme' notices to CSs of AP and Bihar states
supreme-court

న్యూఢిల్లీః ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అమరావతే రాష్ట్ర రాజధాని అని ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి కూడా విదితమే. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు విచారణ తేదీని ఖరారు చేస్తూ ఈరోజు కీలక ప్రకటన చేసింది. మార్చ్ 28న ఈ కేసును విచారిస్తామని తెలిపింది. కేసును త్వరగా విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. వారి విన్నపం మేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేఎం జోసెఫ్ లతో కూడిన ధర్మాసనం తేదీని ఖరారు చేసింది.