ఏపి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
హైకోర్టు ఉత్తర్వులపై స్టే అభ్యర్థన తిరస్కరణ
కేవియట్ వేసిన వారు అఫిడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏపి ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపిలో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపి ప్రభుత్వం తీసుకొచ్చిన 81, 85 జీవోలను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించి, ఏపి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియంలో బోధననే కోరుతున్నారని తెలిపింది. ఏపి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ఏపి ప్రభుత్వం కోరింది. ఏపి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. కేవియట్ వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/