ధనుష్ మూవీ లో టాలీవుడ్ హీరో..

సార్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కోలీవుడ్ హీరో ధనుష్..తాజాగా ఆయన తన 50వ సినిమాను ప్రకటించారు. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా డైరెక్షన్ చేయడం విశేషం. గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా మ్యూజిక్ కోసం ఏఆర్ రెహమాన్ ని తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

కాగా ఈ మూవీ మల్టీ స్టారర్ గా సాగుతుందట. ఏస్ జే సూర్య , విష్ణు విశాల్ లు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా మరో హీరో కోసం టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ను ఎంపిక చేసారని వినికిడి. ఈ విషయం పై అధికార ప్రకటన మాత్రం రాలేదు. ఒకవేళ నిజంగా సందీప్ సెలక్ట్ అయ్యి ఉంటే ఆయన ధనుష్ కి సోదరుడిగా ఈ మూవీ లో కనిపించే అవకాశం ఉంది.