బ్రో ఫస్ట్‌ సింగిల్‌ అప్‌డేట్‌ ఇచ్చిన థమన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ బ్రో. జులై 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఫస్ట్ సింగిల్ కు సంబదించిన అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో ఆసక్తి నింపారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఫస్ట్ సాంగ్ మై డియర్ మార్కండేయ లోడింగ్ అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఎప్పుడు లాంఛ్ చేసేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేశాడు.పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చి వాటి సక్సెస్ లో కీలకంగా మారిన ..థమన్ మరోసారి మ్యూజిక్ అందించడం తో ఈ చిత్రంలోని సాంగ్స్ ఫై మరింత ఆసక్తి పెరిగింది.

బ్రో నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు నెట్టింట హల్‌ చల్‌ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. సాయి ధరమ్‌ తేజ్‌, టైమ్‌ లైన్‌, పవన్‌ కల్యాణ్‌ మధ్య సాగే ఘటనల నేపథ్యంలో బ్రో స్టోరీ ఉండబోతున్నట్టు టీజర్‌తో చెప్పాడు డైరెక్టర్. ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్‌, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తుండగా.. వివేక్‌ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.