రాజ్భవన్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన

హైదరాబాద్ లోని రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ బిల్లును గవర్నర్ పెండింగ్‌లో పెట్టడాన్ని నిరసిస్తూ TRSVతో పాటు పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రాజ్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థినేతలు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.

పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లును అమోదించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన జరుపుతున్నారు. గవర్నర్ బిల్లు ఆమోదించకుండా పెండింగ్ పెట్టి పార్షియాలిటీ చూపిస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లు వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.