లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock market
Stock market

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఒడిదుడుకుల మధ్యే చివరకు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 66 పాయింట్లు లాభపడి 73,872కి పెరిగింది. నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 22,405 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం రూ.82.89 వద్ద కొనసాగుతుంది.