మహేష్ ఫ్యాన్స్ లలో ఆసక్తి రేపుతున్న SSMB28 పోస్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో SSMB28 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రం కావడం తో దీనిపై అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా..మే 31వ తేదీన చిత్ర టైటిల్ ను ప్రకటించబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ మహేశ్ బాబుకు సంబంధించిన ఓ పవర్ ఫుల్ పిక్ ను విడుదల చేసింది. ఫుల్ మాస్ గెటప్ లో ఉన్న మహేశ్ బాబు నేలతల్లికి వందనం చేస్తుండడం ఆ ఫొటోలో చూడొచ్చు.

ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్.. మాస్ స్ట్రైక్ మరొక రెండు రోజుల్లో విడుదల కానుందని ఈ పోస్టర్‌లో మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2024 జనవరి 13న గ్రాండ్‌గా విడుదలకానుంది.