శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు కీలక పదవి..?

మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ..ఈరోజు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ని కలిశారు. గత కేసీఆర్ ప్రభుత్వం శంకరమ్మకు పదవి ఇస్తామని ఊరించి విస్మరించిందనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా శంకరమ్మ సీఎంతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. కాగా శంకరమ్మకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి అప్పగించబోతున్నట్లు తెలుస్తుంది.

త్వరలో ఎమ్మెల్సీ పోస్టులతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీకి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులను ఆదుకుంటామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఉద్యమకారులకు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తుండగా అనూహ్యంగా శంకరమ్మకు కీలక పదవి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి రావడం ఆసక్తిగా మారింది.