ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యాం కారణంగా ఢిల్లీలోని సర్ గాంగారామ్ హాస్పిటల్లో చేరారు. సోనియా కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంకా గాంధీ ఆమె వెంట ఉన్నారు. సోనియా గాంధీ ఉదరకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ డిఎస్ రాణా చెప్పారు. ఆమె పరిస్థితి మెరుగుపడుతోందని, ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ రాణా చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/