ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలు

dharmapuri arvind
dharmapuri arvind

హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కమలం పార్టీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ముఖ్యనేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించి వారివారి అభిప్రాయాలను బిజెపి సీనియర్ నేతలు తెలుసుకుంటున్నారు. అలాగే కెసిఆర్‌ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. అటు సోషల్ మీడియా ద్వారా కూడా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏకిపారేయాలని బిజెపి నాయకత్వం సన్నద్దమైంది. ఇందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని బిజెపి డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో ఎంపీకి సోషల్ మీడియా బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే కెసిఆర్ సర్కార్ అవినీతిని ఎంపీ అర్వింద్ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎంపీ అర్వింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పజెప్పాలని బిజెపి నాయకత్వం నిర్ణయించింది.