మెట్రోల్లో సామాజిక దూరం
ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్
New Delhi: సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మెట్రోరైళ్లలో సామాజిక దూరం పాటించేలా అన్ని చర్యలూ తీసుకుంటామని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ చెప్పారు.
మెట్రో స్టేషన్లలోకి ప్రవేశ మార్గాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ పెడతామన్నారు.
అలాగే టోకెన్ల జారీ ఉండదనీ, స్మార్ట్ కార్డులు, ఇతర డిజిటల్ పద్ధతుల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని కైలాష్ గెహ్లాట్ అన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/