రామతీర్థం ఆలయ అర్చకులకు షోకాజ్ నోటీసులు

రామతీర్థం ఆలయ అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసారు ఆలయ ఈవో కిశోర్ కుమార్. దీనికి కారణం టీడీపీ సీనియన్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఆలయ అర్చకులు పూర్ణకలశంతో స్వాగతం పలకడమే. తాజాగా టీడీపీ భవిష్యత్ కు గ్యారంటీ బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. యాత్ర లో భాగంగా అశోక్ గజపతిరాజు రామతీర్థంకు వెళ్లారు. రామతీర్థం కూడలిలో అశోక్ కు ఆరుగురు ఆలయ అర్చకులు పూర్ణకలశంతో స్వాగతం పలికి ఆయనకు ఆశీర్వచనాలు అందించారు.

ఈ విషయాన్ని ఆలయ ఈవో కిశోర్ కుమార్ తప్పుపట్టారు. ఆరుగురు అర్చకులకు షోకాజ్ నోటీసులు పంపారు. అశోక్ కు ఎందుకు స్వాగతం పలికారో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా ఆలయ అర్చకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైస్సార్సీపీ నేతలకు దమ్ముంటే తమతో పోరాడాలని… పూజలు చేసే పూజారుల మీద మీ ప్రతాపం ఏమిటని విరుచుకుపడ్డాయి. ఆలయ ఈవో వైస్సార్సీపీ నేత మాదిరి వ్యవహరిస్తున్నారని వారంతా మండిపడుతున్నారు.