మూడేళ్ల తర్వాత జగన్ ను కలిసిన షర్మిల

వైస్ షర్మిల మూడేళ్ల తర్వాత తన అన్న జగన్ ను కలిసింది. తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 22న జరగనున్నందున పెళ్లి వేడుకకు రావాల్సిందిగా అన్నాను కోరింది. షర్మిల వెంట భర్త అనిల్, కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి, కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. దాదాపు అరగంట పాటు వైఎస్ షర్మిల, జగన్ కుటుంబాలు సమావేశం అయ్యారు.

అనంతరం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌కు షర్మిల బయలుదేరి వెళ్లి.. అక్కడ విశ్రాంతి తీసుకుని.. రాత్రి 8.50 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇదిలా ఉంటె రేపు సీఎం జగన్ హైదరాబాద్ కు రానున్నారు. ఇటీవల ఫామ్‌హౌస్‌లో కాలుజారి కిందపడి గాయపడిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆయన పరామర్శించనున్నారు. నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్నారు.