టీడీపీ కండువా కప్పుకున్న వైసీపీ కీలక నేతలు..

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో అక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేగంగా మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీ లో ఉన్నారో..? ఎప్పుడు ఏ పార్టీ లో చేరతారో అర్ధం కావడం లేదు. ముఖ్యంగా వైసీపీ నుండి పెద్ద ఎత్తున టీడీపీ లోకి చేరుతున్నారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటూ వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరారు.

చంద్రబాబు వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఒకేసారి భారీ సంఖ్యలో వైసీపీకి చెందిన నేతలు టీడీపీలో చేరగా.. విజయసాయిరెడ్డి సొంత బంధువులే చేరడం విశేషంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులకు ఈ పరిణామం మింగుడు పడటం లేదు. చేరికల సందర్భంగా టీడీపీ ఆఫీస్ కిక్కిరిసిపోయింది.