బంగారు తెలంగాణ కాదు.. బీర్ల తెలంగాణ- బార్ల తెలంగాణ ల షర్మిల

వైయస్ షర్మిల తన పాదయాత్రలో తెలంగాణ సర్కారు ఫై నిప్పులు చెరుగుతూ వస్తుంది. ముందు నుండి టీఆరఎస్ సర్కార్ నే టార్గెట్ గా చేసుకొని ముందుకు వెళ్తున్న షర్మిల..ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో తన పడ్డయాత్ర కొనసాగిస్తోంది. ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయి గూడెం లో వైయస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పరిపాలన అంటే వైయస్సార్ ది అని. కెసిఆర్ ను ఎందుకు ముఖ్యమంత్రి చేశాము అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారని, కెసిఆర్ తన కోసం, తన కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారని విమర్శలు చేసారు. ఇది బంగారు తెలంగాణ కాదు.. బీర్ల తెలంగాణ- బార్ల తెలంగాణ అయిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు కారణం నిరుద్యోగం, నిరుద్యోగానికి కారణం కేసీఆర్. ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలు కావా? ఈ పాపం ముమ్మాటికి కెసిఆర్ దే అని మండిపడ్డారు. ప్రతి ఏడాది ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కెసిఆర్ కి తెలిసింది ఒక్కటే ఫామ్ హౌస్ కి వెళ్లి పడుకోవడం అని ఆమె ఆరోపించారు.