పవన్ ఛాలెంజ్ ని పూర్తి చేసిన వైస్సార్సీపీ మాజీ మంత్రి బాలినేని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విసిరినా ఛాలెంజ్ ను పూర్తి చేసారు వైస్సార్సీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘మై హ్యాండ్‌లూమ్‌.. మై ప్రైడ్‌’ చాలెంజ్‌లో భాగంగా టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ విసిన ఛాలెంజ్ ను పూర్తి చేసిన జనసేనాని పవన్‌ కల్యాణ్..ఆ తర్వాత చంద్రబాబు , బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి లకు ఛాలెంజ్ విసిరారు. దీంతో పవన్ ఛాలెంజ్ ని పూర్తి చేసారు బాలినేని.

పవన్‌ చాలెంజ్‌ను స్వీకరించిన బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి చేనేత దుస్తులు ధరించి ఫోటోలో పెట్టారు. ఈ ఛాలెంజ్ వ్యవహారం అనేది చర్చ కు దారితీసింది. బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. కావాలనే కొంతమంది వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి ఘటనలు బాధాకరమని అన్నారు. తనకు ఊసరవెల్లి రాజకీయాలు చేయడం చేతకాదని రాజకీయాల్లో ఉన్నంత కాలం తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబంతోనే ఉంటానని స్పష్టం చేశారు. చేనేతల కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందని.. ఓ మంచి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్ కు రెస్పాండ్ అయ్యానని అన్నారు బాలినేని. ఇటీవల కాలంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి సీఎం జగన్‌తో మాట్లాడతానని చెప్పుకొచ్చారు.