రెండో రోజు సమావేశమైన విపక్షల కూటమి

second-day-of-the-joint-opposition-meeting-in-bengaluru-begins

బెంగ‌ళూర్ : బెంగ‌ళూర్‌లో రెండో రోజు విప‌క్షాలు సమావేశమయ్యాయి. ఈ భేటిలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బిజెపిని దీటుగా ఎదుర్కొనేందుకు అవ‌స‌ర‌మైన వ్యూహాల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు. స‌మిష్టిగా తీసుకోవాల్సిన అంశాల‌పై బ్లూప్రింట్ త‌యారుచేసేందుకు క‌మిటీ ఏర్పాటు కానుంది.

క‌నీస ఉమ్మ‌డి కార్య‌క్ర‌మం స్ధానంలో లేవ‌నెత్తాల్సిన ఉమ్మ‌డి అంశాల‌ను గుర్తించి జాబితా రూపొందించేందుకు క‌మిటీని నియ‌మించే అవ‌కాశం ఉంది. ఇక యూపీఏ పేరు మార్పు విష‌యంలోనూ విప‌క్షాల స‌మావేశంలో నేత‌లు క‌స‌ర‌త్తు సాగిస్తున్నారు. నాలుగైదు పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న నేత‌లు నేడు నూత‌న కూట‌మి పేరును ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. కూట‌మి పేరులో ఫ్రంట్ అనే ప‌దం వాడ‌రాద‌ని టీఎంసీ సూచించింది.

ఇక, బెంగ‌ళూర్‌లో విప‌క్ష స‌మావేశం రెండో రోజు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌, డీఎంకె ఎంపీ టీఆర్ బాలు హాజ‌ర‌య్యారు. స‌మావేశానికి ముందు కేర‌ళ మాజీ సీఎం ఊమెన్ చాందీ మృతికి నేత‌లు సంతాపం ప్ర‌క‌టించారు. దివంగ‌త నేత మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించామ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. స‌మావేశం అనంత‌రం విప‌క్షాల భేటీలో తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల‌ను నేత‌లు విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించ‌నున్నారు.