31దాకా రెస్టారెంట్ల మూసివేత

ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం

Delhi CM Kejriwal

New Delhi: కరోనా వ్యాప్తి నిరోథక చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలను ప్రకటించింది. రాజధాని నగరంలోని అన్ని రెస్టారెంట్లనూ ఈ నెల 31 వరకూ మూసేయాలని ఆదేశించింది. అలాగే సామాజిక కార్యక్రమాలలో 20 మందికి మించి పాల్గొనరాదని ఆదేశించింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ 31వరకూ ఢిల్లీలోని అన్ని రెస్టారెంట్లనూ మూసేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అలాగే రెస్టారెంట్లలో అల్పాహారం, భోజనం తినడంపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/